News December 21, 2025
లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Similar News
News December 23, 2025
రాజమండ్రి: రౌడీ షీటర్లకు ఎస్పీ ప్రత్యేక కౌన్సెలింగ్

రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు మంగళవారం 6 గంటల పాటు నిరంతరాయంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహా కిషోర్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. అవసరమైతే నగర బహిష్కరణ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.
News December 23, 2025
నేడు కొవ్వూరులో ఆగనున్న 2 ఎక్స్ప్రెస్ రైళ్లు

ఈనెల 23వ తేదీ నుంచి కొవ్వూరు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం-మచిలీపట్నం, విశాఖపట్నం కడప వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ ఆగనున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి కొవ్వూరు రైల్వేస్టేషన్లో జెండా ఊపి రైళ్ళను ప్రారంభిస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు.
News December 23, 2025
నేడు కొవ్వూరులో ఆగనున్న 2 ఎక్స్ప్రెస్ రైళ్లు

ఈనెల 23వ తేదీ నుంచి కొవ్వూరు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం-మచిలీపట్నం, విశాఖపట్నం కడప వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ ఆగనున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి కొవ్వూరు రైల్వేస్టేషన్లో జెండా ఊపి రైళ్ళను ప్రారంభిస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు.


