News March 18, 2024
లోకేశ్ మంగళగిరి సీటు వదులుకోవాలి: వెంకటేశ్వరరావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710752923126-normal-WIFI.webp)
ప్రస్తుతం ఎన్నికల్లో బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వలేదని శ్రీ కృష్ణ యాదవ సేవాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో సోమవారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. సామాజిక న్యాయం పాటించకుండా వలస పక్షులకు సీట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలో లోకేశ్ మంగళగిరి సీటును వదులుకోవాలని, బీసీలకు ఆ సీటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News July 3, 2024
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719982276622-normal-WIFI.webp)
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ను సీఎం కార్యాలయం వెల్లడించింది. ఉదయం 11.00 గంటలకు సచివాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 03.00 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు.
సాయంత్రం 05.00 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారని సీఎం కార్యాలయం తెలియజేసింది.
News July 3, 2024
సత్తెనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719974604402-normal-WIFI.webp)
మండలంలోని వెన్నదేవి గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సత్తెనపల్లికి మండలం కట్టవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల వెంకట రామిరెడ్డి హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వస్తుండగా, వెన్నాదేవి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రామారెడ్డి (55) మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
News July 3, 2024
బాపట్ల: వృద్ధురాలిపై వృద్దుడి అసభ్య ప్రవర్తన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719966977703-normal-WIFI.webp)
వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ వృద్ధురాలు మంగళవారం బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు తన పట్ల అదే గ్రామానికి చెందిన ఇంటి పక్క వీధిలో ఉండే 70 ఏళ్ల వరికూటి సీతారామయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గ్రామీణ సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.