News March 18, 2024

లోకేశ్ మంగళగిరి సీటు వదులుకోవాలి: వెంకటేశ్వరరావు

image

ప్రస్తుతం ఎన్నికల్లో బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వలేదని శ్రీ కృష్ణ యాదవ సేవాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో సోమవారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. సామాజిక న్యాయం పాటించకుండా వలస పక్షులకు సీట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలో లోకేశ్ మంగళగిరి సీటును వదులుకోవాలని, బీసీలకు ఆ సీటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News December 13, 2025

నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

image

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

News December 12, 2025

కాకుమాను: సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా నక్కల ఆగస్టీన్

image

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నక్కల ఆగస్టీన్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఆగస్టీన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టీన్ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

News December 12, 2025

గుంటూరు: వైసీపీ మీడియా ప్యానలిస్టులు వీరే.!

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నూతన మీడియా ప్యానలిస్టులను నియమించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఈ జాబితాలో అవకాశం దక్కింది. ఆవుతు శ్రీధర్, షేక్ మహబూబ్ షరీఫ్‌‌ను హిందీ ఛానెల్స్ ప్యానలిస్ట్‌గా నియమించారు. వీరు పార్టీ తరఫున మీడియాలో వాణి వినిపించనున్నారు.