News November 4, 2025
లోక్ అదాలత్ను వినియోగించుకోండి: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా ప్రజలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ అదాలత్ ఈ నెల 4 నుంచి 15 వరకు జరుగుతుందన్నారు. యాక్సిడెంట్ కేసులు, తగాదాలు, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన ఇతర కేసుల్లో రాజీ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.
Similar News
News November 4, 2025
నిర్మల్: 90 మందికి CMRF చెక్కుల పంపిణీ

నిర్మల్ నియోజకవర్గం పరిధిలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సొన్, మామడ, లక్ష్మణచందా, దిలావర్పూర్, నర్సాపూర్, సారంగాపూర్ మండలాలకు చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ.18,75,000 విలువైన CMRF చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన నివాసంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
News November 4, 2025
అనకాపల్లి: ‘అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

ఏపీ ఎంఎస్ఎంఈడీసీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో విశాఖలో ఎగుమతి సదస్సు జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం తెలిపారు. ఈ సదస్సులో ఇంజినీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్, తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారన్నారు. అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు.
News November 4, 2025
KNR: టెక్నాలజీ హబ్కి శ్రీకారం చుట్టిన NRI

తను నిర్మించే నూతన గృహం యువతకు, ప్రజలకు ఉపయోగపడాలని వినూత్నంగా “రాజ గృహ” అనే పేరును నామకరణం చేసినట్లు NRI సరిగొమ్ముల హరిప్రసాద్ తెలిపారు. ఇల్లందకుంట మండలం బూజునూరులో తను నిర్మించే గృహంలో గౌతమ బుద్ధ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన శ్రీకారం చుట్టారు. తను అమెరికాలో ఉన్నప్పటికీ గ్రామాన్ని విద్యా, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికై టెక్నాలజీ హబ్గా మారుస్తానని హరిప్రసాద్ పేర్కొన్నారు.


