News September 10, 2025
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: సంగారెడ్డి ఎస్పీ

ఈ నెల 13న జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల్లో రాజీ చేసుకోవడం వల్ల కక్షలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, ఆస్తి వివాదాలు, కుటుంబ, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులను ఈ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.
Similar News
News September 10, 2025
గుంటూరు సంయుక్త కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News September 10, 2025
ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఇలా మారుతుంది!

ఎక్కువ మోతాదులో, దీర్ఘకాలం పాటు మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సేవించిన ఆల్కహాల్ దాదాపు కాలేయం ద్వారానే జీర్ణమవుతుందని, ఈ ప్రక్రియలో ఇది అనేక రసాయనాలను విడగొడుతుందని చెబుతున్నారు. ఈక్రమంలో మద్యం తాగే వారిని హెచ్చరించేందుకు ప్రముఖ లివర్ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఫొటోను షేర్ చేశారు.
News September 10, 2025
తిరుపతి: టీటీడీ ఛైర్మన్ను కలిసిన పూర్వపు ఈవో

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడును బదిలీపై వెళ్తున్న పూర్వపు ఈవో శ్యామలరావు బుధవారం ఛైర్మన్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈవోగా పదవీకాలంలో తనకు అన్ని విధాల సహకరించిన బిఆర్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ శ్యామల రావును శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. తర్వాత కాసేపు ముచ్చటించారు.