News December 20, 2025
లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ జానకి షర్మిల

కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. తక్కువ సమయంలో, ఎటువంటి ఖర్చు లేకుండా కేసులను ముగించుకునేందుకు ఇది గొప్ప అవకాశమన్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని కోరారు. తద్వారా సమయం ఆదా కావడమే కాకుండా మనశ్శాంతి లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News December 21, 2025
అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం

శబరిమల నుంచి HYD వస్తున్న అయ్యప్ప భక్తులకు పెను ప్రమాదం తప్పింది. కడప(D) గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, ఆరుగురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఆ లారీని ఢీకొట్టకపోయుంటే బస్సు లోయలో పడే అవకాశముండేదని, అదే జరిగి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగుండేదని భక్తులు వాపోయారు.
News December 21, 2025
ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం పెను ప్రమాదం తప్పింది. శబరిమల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు లోయల పడే అవకాశం ఉండేదనీ, ఒకవేళ ఇదే జరిగింటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని యాత్రికులు వాపోయారు.
News December 21, 2025
తిమ్మాపూర్: గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

ఎల్ఎండి కాలనీలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణకు ధరఖాస్తులను కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ సంపత్ తెలిపారు. టైలరింగ్ శిక్షణ ఈనెల 30న ప్రారంభిస్తామని, శిక్షణ కాలం 31 రోజులని, శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సదుపాయాలంటాయని చెప్పారు. 18 -45 ఏళ్ల పదోతరగతి చదివిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు.


