News December 22, 2025
లోక్ అదాలత్లో 4,881 కేసులు పరిష్కారం: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా మొత్తం 4,881 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరిష్కరించిన కేసుల్లో ఎఫ్ఐఆర్, డ్రంకన్ అండ్ డ్రైవ్, మోటార్ వాహన చట్టం, సైబర్ కేసులు తదితరాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.
Similar News
News December 23, 2025
పర్యాటక హబ్గా నంద్యాల జిల్లా: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News December 23, 2025
పల్స్ పోలియో 99.33 శాతం కవరేజ్: DMHO

గుంటూరు జిల్లాలో DEC 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో లక్ష్యంగా నిర్ణయించిన 2,14,981 మంది పిల్లలలో 2,13,539 మందికి పోలియో చుక్కలు వేయడంతో 99.33 శాతం కవరేజ్ సాధించినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఇంకా 1,442 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. మిగిలిన పిల్లలకు, టీకాలు వేసే క్రమంలో పోలియో చుక్కలు పంపిణీ ఏఎన్ఎంల ద్వారా వేయడం జరుగుతుందని DMHO తెలిపారు.
News December 23, 2025
భాకరాపురంలో జగన్ ప్రజాదర్బార్

AP: వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలో ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.


