News October 27, 2025

లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్‌ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

Similar News

News October 27, 2025

జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ పరిపాలన అధికారి తుమ్మా విజయ్ కుమార్ బొకే అందించి అభినందించారు. అనంతరం పలు సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ్ తెలిపారు.

News October 27, 2025

రేపు జూనియర్ కళాశాలలకు సెలవు: నెల్లూరు RIO

image

నెల్లూరు జిల్లాలో మంగళవారం అన్ని జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ రావు తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 27, 2025

కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి: JAC

image

కందుకూరు జేఏసీ నేతలు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని వారు కోరారు. ఇందుకు నెల్లూరు నేతల అడ్డగింత సరికాదని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.