News March 22, 2025
ల్లాపూర్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం అత్యధికంగా కొల్లాపూర్ పట్టణంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొందలపల్లి 35 డిగ్రీలు, తోటపల్లి, వెల్దండ 34 డిగ్రీలు, అమ్రాబాద్ 32 డిగ్రీలు, అత్యల్పంగా తాడూరు మండల కేంద్రంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News February 11, 2026
వనపర్తి : ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్కు ఏర్పాట్లు…!

వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నేడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 64,190 మంది ఓటర్లు, పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 14,333 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 15 వార్డులకు 18,192 మంది, అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులకు 9,147 మంది, ఆత్మకూరు మున్సిపాలిటీలో 10 వార్డులకు 11,579 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News February 11, 2026
జనగామ: ఎన్నికల పర్యవేక్షణకు నిఘా బృందాలు ఇవే!

జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 102 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు పర్యవేక్షణ, నిఘా బృందాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 6, స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు 9, జోనల్ ఆఫీసర్స్ 9, రూట్ ఆఫీసర్స్ 9 మందిని నియమించారు. ఎన్నికల ప్రక్రియ విధులకు 375 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.
News February 11, 2026
GWL: నేడు పాఠశాలలకు సెలవు-డీఈవో విజయలక్ష్మి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు నేడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో విజయలక్ష్మి మంగళవారం రాత్రి ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖ నుంచి ఎక్కువ మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నందున సెలవు ప్రకటించామన్నారు. ఈనెల 14న రెండో శనివారం యథావిధిగా పాఠశాలలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


