News February 27, 2025
వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 27, 2026
విశాఖలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కిరెడ్డిపాలేనికి చెందిన తలాడ గోపాలరావు స్కూటీపై బీహెచ్పీ వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో జీవీఎంసీ చెత్త లారీ వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు
News February 27, 2026
❤️GREAT: ఏమని చెప్పగలం.. సెల్యూట్ చేయడం తప్ప!

ఓ వైపు పేదరికం, మరో వైపు శారీరక లోపమున్నా ఆకాశమంత సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు సునీత(ఒడిశా). తల్లి చంకలో ఉన్న ఈమెకు పుట్టుకతోనే మూగ, చెవుడు. 15ఏళ్ల వయసులోనూ ఎత్తు 1.5 అడుగులే. 12 ఏళ్ల కిందటే తండ్రి చనిపోయారు. ఇన్ని కష్టాల్లోనూ ఆమె ఆశయాన్ని వీడకుండా టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారు. సైగలతో చెబితే మరో విద్యార్థి పరీక్షలు రాస్తున్నారు. ఎందరిలోనో స్ఫూర్తి రగిలిస్తున్న సునీతకు సెల్యూట్.
News February 27, 2026
HNK: గంటల వ్యవధిలో తల్లీకొడుకు మృతి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేంద్ర(72) అనే వృద్ధురాలి కుమారుడు నరహరి (55) బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది బుధవారం ఉదయం కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే రాత్రి నరహరి కూడా మృతి చెందారు. గంటల వ్యవధిలో ఇద్దరినీ కోల్పోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.


