News September 12, 2025
వట్లూరు రైల్వే ట్రాక్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి

వట్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు వట్లూరు రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పక్కన కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం దొరికింది. ఆరంజ్ రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తి వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలు తెలిసినవారు రైల్వే HC ప్రసాద్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 12, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐల బదిలీలు

ఆసిఫాబాద్ జిల్లాలో పలువురు SIలను బదిలీ చేస్తూ రామగుండం CP ఉత్తర్వులు జారీ చేశారు. SI-II, సిర్పూర్-T PD Att. కాగజ్నగర్-టి PSలో విధులు నిర్వహిస్తున్న సురేష్ను సిర్పూర్-T PSకు, సిర్పూర్-T SI ఎం.కమలాకర్ను VR KBM ఆసిఫాబాద్కు, VR, KBM ఆసిఫాబాద్లో ఉన్న డి.చంద్రశేఖర్ను కౌటాలకు, కౌటాలలో విధులు నిర్వహిస్తున్న జి.విజయ్ను VR కల్పించారు.
News September 12, 2025
VJA: ‘రొయ్యల ఎగుమతులతో రూ.60 వేల కోట్లు ఆదాయం’

మన రాష్ట్రంలో పండించే రొయ్యలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఏడాదికి రూ. 60 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి వస్తుందని ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరామ్ అన్నారు. అమెరికా అధిక సుంకాల నేపథ్యంలో రొయ్యల ఎగుమతి ధరలు తగ్గటం వల్ల రొయ్యలు సాగు చేసే రైతులతో పాటు, దేశం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
News September 12, 2025
వంగూర్: బైక్పై నుంచి జారిపడి మహిళ మృతి

బైక్పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన వంగూర్ మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట(M) అక్కారం తాండాకు చెందిన బాలునాయక్ తన భార్య కళతో కలిసి కల్వకుర్తి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగూర్ గేటు వద్ద బైక్పై నుంచి కళ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.