News February 25, 2025
వడ్డేపల్లి: పెళ్లింట విషాదం.. వరుడి సోదరుడు మృతి

వడ్డేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో సోమవారం బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మురళి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. మండలంలోని బుడ్డమొరుసుకి చెందిన రాజన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జానకి రాముడు వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులను శాంతినగర్ లో దింపేందుకు చిన్న కుమారుడు మురళి వెళుతుండగా ప్రమాదం జరిగి పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News December 15, 2025
శివంపేట: ఓట్ల కోసం బట్టలు ఉతుకుతూ ప్రచారం

శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ 1వ వార్డులో వార్డు సభ్యురాలి భర్త చాకలి బాబు వినూత్నంగా ప్రచారం చేశారు. తన భార్య తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మహిళలతో కలిసి బట్టలు ఉతుకుతూ, గ్రామంలోని సమస్యలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ వింత ప్రచారం అల్లీపూర్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
News December 15, 2025
భజన పాటలు వింటున్నారా?

లైవ్లో భజన పాటలు వినడం, పాడటం వల్ల ఎన్నో లాభాలున్నాయట. ఆ పాటలు వింటున్నప్పుడు మన మనసు సానుకూల శక్తిని గ్రహించి, ప్రతికూల శక్తులను బయటకు పంపుతుందట. లయబద్ధమైన శబ్దం మానసిక చికిత్సగా పనిచేసి మన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుందట. వీటికి మనలోని ఏకాగ్రతను పెంచే శక్తి ఉందని నమ్ముతారు. డోపమైన్ విడుదల చేసి, మన భావోద్వేగ స్థిరత్వాన్ని సైతం పెంచుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సామూహిక భజనలు బంధాలను పెంచుతాయి.
News December 15, 2025
సర్పంచ్ రిజల్ట్స్.. ‘టాస్’తో గెలిచారు

TG: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చాయి. నల్గొండలోని మంగాపురంలో ఉపేంద్రమ్మకు, మౌనికకు సమానంగా ఓట్లు రాగా టాస్ వేయడంతో ఉపేంద్రమ్మకు పదవి వరించింది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో సంతోశ్, మానయ్యకు 483 ఓట్ల చొప్పున పోల్ అవ్వగా టాస్ వేసిన అధికారులు సంతోశ్ను విజేతగా ప్రకటించారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో అధికారులు డ్రా తీసి విజేతలను నిర్ణయించారు.


