News October 25, 2025
వనపర్తిలో భారీ వర్షాలు.. విలియంకొండలో 101.8 మి.మీ.

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8:30AM నుంచి శనివారం ఉదయం 8:30AM) భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విలియంకొండలో 101.8 మి.మీ. వర్షం కురిసింది. ఏదుల 69.5 మి.మీ., పెద్దమందడి 57.5 మి.మీ., గోపాల్పేట 54.3 మి.మీ., మదనాపురంలో 52.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
Similar News
News October 25, 2025
ప్రజల భద్రత కోసం పటిష్ఠ చర్యలు: అనకాపల్లి ఎస్పీ

తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు అన్ని అవసరమైన చర్యలను చేపట్టారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయం నుంచి మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. స్థానిక అధికారుల సూచనలు ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.
News October 25, 2025
సిరిసిల్ల: దివ్యాంగుల పెట్రోల్ బంక్ అభినందనీయం: ఇన్ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల కలెక్టరేట్: దివ్యాంగుల పెట్రోల్ బంక్ ఏర్పాటు అభినందనీయమని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. శనివారం ఆమెను కలిసిన పెట్రోల్ బంక్ నడుపుతున్న దివ్యాంగులు, జిల్లా యంత్రాంగం సహకారంతో తమకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెట్రోల్ బంక్ నిర్వహణ వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
News October 25, 2025
కాకినాడ: అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టర్తో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


