News March 21, 2025
వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
Similar News
News March 21, 2025
ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర: మందకృష్ణ

AP: SC వర్గీకరణపై APఅసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణలో CM చంద్రబాబు పాత్ర కీలకమని పేర్కొన్నారు. ‘1997-98లోనే వర్గీకరణపై చంద్రబాబు తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన న్యాయం వైపే ఉన్నారు. జగన్ ఉంటే వర్గీకరణ జరిగేది కాదు. మోదీ, అమిత్ షా, వెంకయ్య, కిషన్ రెడ్డి, పవన్ అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు.
News March 21, 2025
నిర్మల్: పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9,115 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.