News April 17, 2025

వనపర్తి: ‘అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను’ 

image

58 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు నెల రోజుల్లో అనుమతి ఇవ్వాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటానని బీజేపీ వనపర్తి పట్టణ మాజీ అధ్యక్షుడు బచ్చు రాము హెచ్చరించారు. వనపర్తి మండలంలోని తిరుమలయ్య గుట్ట క్రాస్ రోడ్డు వద్ద 58 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటుకు ఐదు గుంటల భూమి ఇవ్వాలని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

Similar News

News April 19, 2025

నంద్యాల జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం

image

నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో రైతులు విస్తారంగా సాగుచేసిన బొప్పాయి నేలకూలింది. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆలమూరులో సుమారు 150 ఎకరాల్లో సాగుచేసిన బొప్పాయి పంట ఈదురుగాలుల కారణంగా నేలవాలింది. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. అకాల గాలి వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

News April 19, 2025

తిరుపతి: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (DW&CW) తిరుపతి జిల్లా పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 3 విభాగాలలో ఖాళీగా ఉన్న 5 ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. పారామెడికల్-1, మల్టీపర్పస్ స్టాప్/ కుక్ -3, సెక్యూరిటీ గార్డ్ -1 ఖాళీలు ఉన్నాయి. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30.

News April 19, 2025

నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

image

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

error: Content is protected !!