News April 3, 2025

వనపర్తి: ‘ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని పునః సమీక్షించండి’

image

ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని(AEBAS) తక్షణమే పునః సమీక్షించాలని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇతర ప్రత్యామ్నాయ హాజరు విధానాన్ని అనుమతించాలని కోరుతూ గురువారం వనపర్తి డీఎంహెచ్‌వో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల వాస్తవ సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 8, 2025

జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

image

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.

News November 8, 2025

ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

image

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 8, 2025

మెదక్‌లో ముగిసిన జోనల్ స్థాయి మీట్

image

మూడు రోజులుగా మెదక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో జరిగిన రాజన్న సిరిసిల్ల 11వ జోనల్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల పీడీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.