News October 9, 2025

వనపర్తి: ఈవీఎం గోదాము పరిశీలన

image

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు, వీవీప్యాట్‌ గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయం వెనుక ఉన్న గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ (ఎన్నికల సంఘం) మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు.

Similar News

News October 9, 2025

ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుంది?

image

TG: బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంపై HCలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. GO-9తో పాటు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పైనా ధర్మాసనం స్టే విధించింది. దీంతో ఇప్పుడు INC సర్కార్ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ముందే నిర్ణయించుకున్నట్లు ‘ప్లాన్-బి’ ప్రకారం పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇలా చేయాలంటే మళ్లీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

News October 9, 2025

CM చంద్రబాబు పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధత.?

image

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

News October 9, 2025

SEBIలో 110 పోస్టులు

image

SEBI 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. OCT 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టును బట్టి BE, బీటెక్, LLB, PG, CFA, CA, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.sebi.gov.in/