News December 18, 2025

వనపర్తి: ‘ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి’

image

రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,80,294 రేషన్ కార్డుల్లోని 6,09,645 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటివరకు 4,23,466 మంది లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగతా 1,86,179 లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న రేషన్ షాపుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

Similar News

News December 25, 2025

రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు: డీకే అరుణ

image

గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ డికే అరుణ అన్నారు. బుధవారం నారాయణపేటలో నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గెలుపొందిన బీజేపీ సర్పంచ్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని అన్నారు.

News December 25, 2025

ప్రెగ్నెన్సీలో కింద కూర్చొంటున్నారా?

image

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులను గమనించుకుని తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవాలి అనుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.

News December 25, 2025

శివుడిగా పూజలందుకున్న తిరుమల శ్రీవారు

image

తిరుమల శ్రీవారు ఒకప్పుడు శివుడిగా పూజలందుకున్నారని చాలామందికి తెలిసుండదు. మూలవిరాట్టుకు ఉన్న జటలు, నాగభూషణాలు చూసి భక్తులు ఆయనను ఈశ్వరుడిగా భావించేవారు. రామానుజాచార్యులు నిర్వహించిన పరీక్షలో శ్రీవారు శంఖుచక్రాలు ధరించి అది వైష్ణవ రూపమని నిరూపించారు. తిరుమల ఆలయానికి రుద్రుడు క్షేత్రపాలుడిగా ఉండటం హరిహర అద్వైతానికి, శైవ వైష్ణవ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.