News October 7, 2025
వనపర్తి: ‘ఉత్తమ ఉర్దూ టీచర్’ అవార్డులకు దరఖాస్తులు

ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డు-2025 లకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అఫ్జలుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకొని, సంబంధిత ధ్రువపత్రాలతో కలిపి ఈ నెల 14వ తేదీలోగా జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు. ఇతర వివరాల కోసం 08545232500 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
Similar News
News October 7, 2025
కంచం కడిగిన నీటిని ఏ దిక్కున పారబోయాలి?

పళ్లెం కడిగిన నీటిని పారబోసే దిక్కులు మన వృద్ధిని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల వైపు చల్లడం శుభప్రదం అని అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం వైపు చల్లితే లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి, సౌభాగ్యం కలుగుతాయని సూచిస్తున్నారు. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం వంటి దిక్కుల్లో పారబోస్తే ఇంట్లో సంకటాలు, రోగభయాలు, శత్రుత్వం వంటివి కలుగుతాయని అంటున్నారు.
News October 7, 2025
MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై

కరూర్ తొక్కిసలాటపై TNలో రాజకీయ చిచ్చు రాజుకుంది. ప్రభుత్వాన్ని పొగిడిన కమల్ హాసన్పై బీజేపీ నేత అన్నామలై విరుచుకుపడ్డారు. MP సీటుతో DMKకి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆయన్ను తమిళ ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదని అన్నారు. కాగా ఇటీవల బాధితుల్ని పరామర్శించిన NDA ఎంపీలు ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. కరూర్ ఘటనను BJP రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని CM స్టాలిన్ దానికి కౌంటరిచ్చారు.
News October 7, 2025
‘న్యూ ఇండియా పార్టీ’కి షోకాజ్ నోటీస్ జారీ: కలెక్టర్

ఆడిట్ రిపోర్టులు సమర్పించకపోవడంతో న్యూ ఇండియా పార్టీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు PDPL జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు. 2021- 24 ఏడాదులకు చెందిన ఆడిట్ అకౌంట్స్ అందజేయలేదని, ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 29ఏ ప్రకారం ఇది తప్పనిసరని పేర్కొన్నారు. నిర్దిష్ట వ్యవధిలో సమాధానం ఇవ్వకపోతే, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తింపు రద్దు వరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.