News February 5, 2025

వనపర్తి: ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్.!

image

వనపర్తి జిల్లా సాయుధ దళ కార్యాలయం (ఆర్మ్డ్ రిజర్వ్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.రవి కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ రవికుమార్‌పై పెబ్బేరు పోలీస్ స్టేషన్‌లో ఒకే రోజు 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిర్లక్ష్యంగా, దుష్ప్రవర్తనతో వ్యవహరించిన కారణంగా కానిస్టేబుల్ రవికుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 6, 2025

జగిత్యాల: రైతుభరోసా నిధులు విడుదల

image

ఒక ఎకరం వరకు ఉన్న రైతుల అకౌంట్లలో ఇవాళ రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపింది. అయితే, రైతుభరోసా కింద జగిత్యాల జిల్లాలో 84,504 మంది రైతులకు గాను రూ.35,61,20,462 విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రైతుభరోసా నిధులను విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 6, 2025

జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేటి దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,050, గరిష్ఠ ధర రూ.6,418గా నమోదయ్యింది. అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,095, గరిష్ఠ ధర రూ.7,955గా ఉంది. మక్కలు ధర రూ.2,222గా ఉంది. ధాన్యం (1010) ధర రూ.1,655గా ఉండగా, ధాన్యం (JSR) ధర రూ.2,653గా ఉంది. ఈ వివరాలను మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

News February 6, 2025

US నుంచి భారత్‌కు ఫ్లైట్.. ఏ రాష్ట్రం వారు ఎందరున్నారంటే?

image

మన దేశానికి చెందిన కొందరిని US అక్రమ వలసదారులుగా గుర్తించి సైనిక విమానంలో తిరిగి పంపిన విషయం తెలిసిందే. టెక్సాస్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ఈ మధ్యాహ్నం విమానం రాగా అందులో 104 మంది భారతీయులున్నారు. వారిలో 30మంది పంజాబ్, 33మంది హరియాణా, 33మంది గుజరాత్ వాసులున్నారు. వీరితో పాటు MHకు చెందిన ముగ్గురు, UPకి చెందిన ముగ్గురు, చంఢీగఢ్‌ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

error: Content is protected !!