News March 19, 2025
వనపర్తి: కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది: రాజేంద్రప్రసాద్

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి బీసీ ఎస్సీ వర్గాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ జిల్లా ఆఫీసులో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం కోసం కులగణనను చేపడతామన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేశారన్నారు.
Similar News
News July 9, 2025
‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్కు రూ.100 కోట్లు?

హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ‘హొంబలే ఫిల్మ్స్’ ₹15 కోట్లతో రూపొందిస్తే ₹400 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ చిత్రానికి రిషబ్ ₹4కోట్లు మాత్రమే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కాంతార ప్రీక్వెల్’పై భారీ అంచనాలు ఉండటంతో రిషబ్ తన పారితోషికాన్ని భారీగా పెంచి ₹100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
News July 9, 2025
SRSPలో తగ్గిన వరద నీటి ప్రవాహం

మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.
News July 9, 2025
భారత నేవీలో 1,040 పోస్టులు

భారత నేవీలోని పలు విభాగాల్లో 1,040 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PH, మహిళలు మినహా మిగతావారికి రూ.295గా ఉంది. రాతపరీక్షతో పాటు పలు పోస్టులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పూర్తి వివరాల PDF కోసం ఇక్కడ <