News October 15, 2025

వనపర్తి: క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

image

వనపర్తి జిల్లా అండర్ 14, 17 బాల, బాలికలకు నిర్వహించే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్ అథ్లెటిక్స్ క్రీడలను బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థుల ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 15 మండలాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలవాలని సూచించారు.

Similar News

News October 15, 2025

ANU: B.TECH సప్లమెంటరీ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన B.TECH 1&4-1 సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు, PG-2 సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. B.TECH సప్లిమెంటరీ 35.14%, PG MBA ఇంటర్నేషనల్ బిజినెస్ 95%, MPA థియేటర్ ఆర్ట్స్ 45.45% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 15, 2025

తిరుపతిలో వైసీపీ నాయకుల నిరసన

image

సోషియల్ మీడియాలో ప్రశ్నించారని వైసీపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కూటమి ప్రభుత్వానికి వత్తాసుగా నిలుస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

News October 15, 2025

భూపాలపల్లిలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

image

భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, సహకార తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ చాలా కీలకమని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.