News March 27, 2025

వనపర్తి: క్రీడాకారులు, నిర్వాహకులను అభినందించిన ఎస్పీ

image

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం క్రీడా మైదానంలో మెడికల్ విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వాహకులను జిల్లా ఎస్పీ గిరిధర్ అభినందించారు. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దేహ దారుఢ్యం మెరుగుపడుతుండటంతోపాటు, పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ కిరణ్మయి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News March 30, 2025

పర్యాటక అభివృద్ధే లక్ష్యం: కలెక్టర్ 

image

ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు విజన్ 2047ను సాధించాలంటే ఇప్పటి నుంచే పక్క ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక అభిరుద్దితో జిల్లాను ముందంజులో నడపాలన్నారు. అనంతరం సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా మహిళా ఉన్నతాధికారులతో కొండపల్లి కోట వద్ద కలెక్టర్ ఫొటో దిగారు. 

News March 30, 2025

HYD: మట్టి కుండలతో ఆరోగ్యం!

image

మట్టికుండలతో ఎంతో ఆరోగ్యమని మూడుచింతలపల్లికి చెందిన మట్టిపాత్రల తయారీదారుడు కనకరాజు తెలిపారు. ప్రస్తుతం ఈ పాత్రలు ఎక్కువగా వాడడం లేదని, ఉగాది వస్తే మట్టిపాత్రలకు జనాలు బారులు తీరేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్, స్టీలు వినియోగం పెరిగిందన్నారు. వీటితో ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ఇకనైనా మట్టిపాత్రలు వాడితే ఆరోగ్యంతో పాటు వృత్తిదారులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.

News March 30, 2025

జహీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

image

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.

error: Content is protected !!