News February 2, 2026

వనపర్తి: గుర్తుల కేటాయింపుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి: కలెక్టర్

image

మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలనే అభ్యర్థులు స్వయంగా వచ్చి ఉపసంహరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలాకాకుండా ప్రతిపాదిత వ్యక్తి, ఏజెంట్ ఉపసంహరణ పత్రం సమర్పిస్తే అధికారులు తప్పనిసరిగా అభ్యర్థికి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలన్నారు.

Similar News

News February 21, 2026

సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

image

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.

News February 21, 2026

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

image

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ప్రపంచం ముందు మనమంతా ఐక్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. రాజకీయ నాటకాలకు AI సమ్మిట్‌ను ఎంచుకోవడం సరికాదని BRS MLA కేటీఆర్ విమర్శించారు. INC కార్యకర్తలు CM రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన చేపట్టారంటూ Xలో ఎద్దేవా చేశారు.

News February 21, 2026

PDPL: పెళ్లి వేడుకలో వ్యక్తి దారుణ హత్య

image

రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్‌ వద్ద శనివారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.