News April 9, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణకు అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తన తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి.. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో ఆమె గొడ్డలితో అతడిపై దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Similar News

News January 6, 2026

BREAKING: విజయ్‌కు సీబీఐ నోటీసులు

image

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.

News January 6, 2026

ఆకివీడు: షైనీ ప్రతిభను మెచ్చి కేంద్ర మంత్రి అభినందనలు

image

అంతర్జాతీయ స్థాయిలో మల్టీ టాలెంటెడ్ అవార్డుతో పాటు ఇటీవల ‘నంది’ అవార్డు గెలుచుకున్న ఆకివీడు మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ శిష్యురాలు ఘంటా షైనీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అభినందించారు. మంగళవారం ఆయనను కలిసిన షైనీని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

News January 6, 2026

KMR: ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ మహిళా మైనారిటీ యువజన పథకం’ కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ కోరారు. జిల్లాలోని పేద ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.