News March 17, 2025
వనపర్తి: చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి

వీపనగండ్ల మండల పరిధిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కల్వరాలకు చెందిన నర్సింహ(62) నాన్చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వెళ్లిన ఆయన ఎంతకు తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు చెరువులో గాలించగా ఆదివారం నర్సింహ మృతదేహం కనిపించింది. ఈమేరకు కేసు నమోదైంది.
Similar News
News November 4, 2025
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై కమిటీ

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్కు చోటు కల్పించింది. రీయింబర్స్మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.
News November 4, 2025
VZM: విజేతలను అభినందించిన ఎస్పీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులను తన కార్యాలయంలో SP దామోదర్ అభినందించారు. ప్రథమ బహుమతిగా రూ.2వేలు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయంగా రూ.1000 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన పెంపొందించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలని సూచించారు.
News November 4, 2025
గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో పీఎం ఉజ్వల యోజన కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భైర్లూటి గూడెం, గులాం అలియాబాద్ తాండాలలో ఏర్పాటైన నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.


