News December 14, 2025
వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @1PM

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా 1PM గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 83.9% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 79.6%, కొత్తకోట 84.5%, మదనాపూర్ 86.2%, ఆత్మకూరు 83.8%, అమరచింత 89.2% పోలింగ్ నమోదైంది.
Similar News
News December 16, 2025
రాజయ్యపేట: మత్స్యకారులతో సీఎం భేటీ వాయిదా

నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులతో సీఎం చంద్రబాబు భేటీ వాయిదా పడింది. ఈ విషయాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు తెలియజేసినట్లు మత్స్యకార ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం సీఎంతో భేటీ జరగాల్సి ఉంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మత్స్యకార నాయకులతో హోంమంత్రి అనిత చొరవతో 16న భేటీ ఏర్పాటు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు మత్స్యకారులు తెలిపారు.
News December 16, 2025
పోర్టు కళావాణి స్టేడియం స్వాధీనం చేసుకున్న యాజమాన్యం

అక్కయ్యపాలెం జాతీయ రహదారి కానుకొని ఉన్న పోర్టు కళా వాణి ఆడిటోరియం లీజు ఒప్పందాలను రద్దు చేసినట్లు విశాఖ పోర్ట్ అథారిటీ యాజమాన్యం ప్రకటించింది. క్రీడా సముదాయం గతంలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించామని లీజ్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు పాటించకపోవడంతో రద్దుచేసి నోటీసులు జారీ చేశామని పోర్టు యాజమాన్యం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్టేడియం స్వాధీనం చేసుకున్నారు.
News December 16, 2025
‘నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టులను ధైర్యంగా <<18564673>>అడ్డుకున్న<<>> అహ్మద్ ప్రస్తుతం బుల్లెట్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను అతని బంధువు ముస్తఫా మీడియాకు వెల్లడించారు. ‘నేను ఉగ్రవాదిని అడ్డుకోవడానికి వెళ్తున్నా. నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’ అని చెప్పి అహ్మద్ వెళ్లాడని తెలిపారు. తన కొడుకు నిజమైన హీరో అని, అతనిని చూసి గర్విస్తున్నట్లు తండ్రి చెప్పారు.


