News March 5, 2025
వనపర్తి జిల్లాలో వ్యక్తి మృతి

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. హీర్లతండాకు చెందిన హరిచంద్, వాలీబాయి భార్యభర్తలు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన హరిచంద్ రాత్రి ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందనట్లు వారు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 6, 2025
TODAY HEADLINES

☞ ఢిల్లీకి AP సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో భేటీ
☞ పవన్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ: YS జగన్
☞ MLC అభ్యర్థిగా నాగబాబు.. ప్రకటించిన జనసేన
☞ KNR-MDK-NZB-ADB గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు
☞ అతి త్వరలో గ్రూప్-1 ఫలితాలు: TGPSC
☞ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదు: పోలీసులు
☞ ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్కు న్యూజిలాండ్
News March 6, 2025
ట్రంకు పెట్టెలో కారీలు.. వాళ్లంతా ఏమైపోయినట్లు?

చిన్నతనంలో ఉదయం లేవగానే చాయ్ తాగుతూ కారీలు, బన్నులు తినేవాళ్లం గుర్తుందా? ‘బొంబాయ్ కారీలు’ అని అరుస్తూ ట్రంకు పెట్టెలను తలపై పెట్టుకొని కొందరు గల్లీల్లో తిరిగేవారు. 90s బ్యాచ్కు వీరితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడు వారంతా కనుమరుగైపోయారు. వీరు మన ఇళ్ల మీదుగా వెళ్తుంటే కారీల వాసనకు నోరూరేది. ఇప్పుడంతా కల్తీ అయిపోవడంతో వీటిని తినడమూ చాలా మంది మానేశారు. బొంబాయ్ కారీలు మీరెప్పుడైనా తిన్నారా?
News March 6, 2025
సీపీఎంకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి: కూనంనేని

సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ బృందం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ ఒప్పందం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరారు. సీఎం అధిష్టానంతో చర్చించి సానుకూలంగా స్పందిస్తానని తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.