News March 31, 2025

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా దగడ, వెలుగొండలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు 40.4, రేమోద్దుల 40.3, ఆత్మకూరు 40.1, పానగల్ 39.7, శ్రీరంగాపూర్ 39.7, కానాయిపల్లి 39.6, జానంపేట 39.6, విలియంకొండ 39.5, వీపనగండ్ల 39.5, సోలిపూర్ 39.1, గోపాల్‌పేట 39.1, అమరచింత 39.1, మదనాపూర్ 38.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 28, 2025

కృష్ణా: గ్యాస్ బావుల తవ్వకానికి 35 చోట్ల అనుమతులు..?

image

కృష్ణా జిల్లాలోని గూడూరు, పామర్రు, మొవ్వ మండలాల పరిధిలోని 35 ప్రాంతాల్లో వేదాంత సంస్థ చమురు, గ్యాస్ తీసుకునేందుకు పరిశీలిస్తోంది. పంట కాలువలకు దూరంగా ఆయిల్, గ్యాస్ తీసేందుకు బావులు ఏర్పాటు చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు సంస్థకు సూచించినట్లు తెలుస్తోంది. ఒక్కో బావిని 3-4 వేల మీటర్ల లోతులో తవ్వి పైపులను వేయనున్నారు, దీనివల్ల వ్యవసాయ భూములకు ఎలాంటి నష్టం వాటిల్లదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

News December 28, 2025

‘మా డాడీ ఎవరో తెలుసా?’ అని చెప్పొద్దు.. సజ్జనార్ వార్నింగ్

image

TG: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News December 28, 2025

భూపాలపల్లి: పులి కలకలం.. ఎద్దుపై దాడి!

image

జిల్లాలోని చిట్యాల మండలం జడలపేట శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి గాంధీనగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఎద్దుపై దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. పొలాలకు వెళ్లే దారిలో పులి అడుగుజాడలు కనిపించడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, పులి జాడను గుర్తించి తమకు రక్షణ కల్పించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.