News December 15, 2025
వనపర్తి జిల్లాలో 81 గ్రామాలకు ఈనెల 17న ఎన్నికలు

మూడో విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 గ్రామ పంచాయతీలు 806 వార్డులకు గాను చిన్నంబావిలో గడ్డబస్వాపూర్, పానగల్లో దావాజిపల్లి, బహదూర్ గూడెం, పెబ్బేర్లో పెంచికల్ పాడు,రాంపూర్ (6) గ్రామాల సర్పంచులు,104 వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ తెలిపారు. 81 సర్పంచ్, 702 వార్డు మెంబర్లకు బుధవారం ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
SRD: పోలింగ్ సరళి పరిశీలిస్తున్న ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. పోలింగ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తునట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, రూట్ మొబైల్ బృందాల కదలికలను పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నామన్నారు.
News December 17, 2025
పంచాయతీ పోరు: పాన్గల్లో జోరు.. వీపనగండ్లలో నెమ్మది

వనపర్తి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా పాన్గల్ మండలంలో 56.7 శాతం పోలింగ్ నమోదు కాగా, వీపనగండ్లలో అత్యల్పంగా 52.4 శాతం నమోదైంది. పెబ్బేరు(55.6%), శ్రీరంగాపూర్(54.9%), చిన్నంబావి(54%)ల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు మండలాల్లోనూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు.. లోకేశ్ సత్కారం

మహిళా ప్రపంచకప్లో సత్తాచాటిన కడప క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ నజరానా అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచరణి ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొనియాడారు.


