News April 16, 2025
వనపర్తి: టెన్త్ పాసయ్యారా.. JOBS మీ కోసమే..!

వనపర్తి జిల్లాలోని నిరుద్యోగ యువతకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి గుడ్ న్యూస్ చెప్పారు. పలు కంపెనీల్లో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. వనపర్తిలోని PMKK ఆఫీస్లో ఈనెల 17న ఉ.10 గంటలకు జాబ్ మేళా ఉంటుందన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉండి టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులన్నారు. 7799073053లో సంప్రదించాలన్నారు.
Similar News
News September 16, 2025
కామారెడ్డిలో ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’

కామారెడ్డి జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్సీల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 15 రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
News September 16, 2025
సంగారెడ్డి: ‘శారీరక వైకల్యం విద్యార్థుల ప్రొఫార్మా సమర్పించాలి’

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల ప్రొఫార్మా-I ను సమర్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ల తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల PH సర్టిఫికెట్లను డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. మార్చి 2026లో జరిగే రెగ్యులర్ SSC పబ్లిక్ పరీక్షలకు CWSN అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
News September 16, 2025
ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి

తెలంగాణలో నలుగురు IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. NVS రెడ్డిని HMRL ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ, SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యలకు అదనపు బాధ్యతలిస్తూ నిర్ణయించింది. పూర్తి వివరాలకు <