News October 13, 2025
వనపర్తి: డీసీసీ బరిలో బలహీన వర్గాల నేతలు..?

వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి బలహీన వర్గాల వారే పోటీలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, లక్కాకుల సతీష్, న్యాయవాది డి.కిరణ్ కుమార్, మరో న్యాయవాది తిరుపతయ్య, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ కౌన్సిలర్ వెంకటేశ్ వర్గాలకు చెందినవారు అంటున్నారు. వనపర్తి డీసీసీ అభ్యర్థుల పరిశీలనకు రేపు స్టేట్ అబ్జర్వర్ వనపర్తి R&B గెస్ట్ హౌస్కు రానున్నట్లు చెబుతున్నారు.
Similar News
News October 13, 2025
విచారణ జరిపి న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

చట్ట ప్రకారం విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 125 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు.
News October 13, 2025
పాకిస్థాన్కు అఫ్గాన్ షాక్!

<<17987289>>వివాదం<<>> వేళ పాక్కు అఫ్గాన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో పర్యటిద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా, ISI చీఫ్ ఆసిమ్ మాలిక్ వీసాలను రిజెక్ట్ చేసింది. అటు పాక్తో జరగనున్న టీ20 మ్యాచ్ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్, లంక, అఫ్గాన్ త్వరలో ట్రై సిరీస్ ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్తో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధించుకుంటోంది. ఆ దేశ మంత్రి ముత్తాఖీ IND పర్యటనలో ఉన్నారు.
News October 13, 2025
జగిత్యాల: ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక

జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 400–600 చదరపు అడుగుల్లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. బిల్లుల్లో జాప్యాలు, సమస్యలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మేస్త్రి, కూలీల కొరత లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని తెలిపారు.