News March 22, 2025
వనపర్తి: ‘తిరుమలయ్య గుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దాలి’

వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టపై చిట్టడవిలో సంస్థానాధీశుల కాలంలో ప్రతిష్ఠించిన తిరుమలనాథస్వామి ఆలయం సుమారు 600 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఔషధ గుణాలున్న ఎన్నో చెట్లు ఈ గుట్టపై ఉన్నాయి. ఏటా శ్రావణమాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, AP రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
Similar News
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.
News November 13, 2025
వేములవాడ: మూడుకు తగ్గిన VIP గెస్ట్ హౌస్లు..!

వేములవాడ రాజన్న ఆలయంలో VIP గెస్ట్ హౌస్ల సంఖ్య మూడుకు తగ్గిపోయింది. భీమేశ్వరాలయం పక్కన మొత్తం 5 గెస్ట్ హౌస్లు ఉండగా, ఇటీవలి మార్పులలో భాగంగా ఒకదాంట్లో PRO కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరోదాంట్లో లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా రాజన్న భక్తుల కోసం మిగిలిన అతిథి గృహాల సంఖ్య మూడుకు తగ్గింది. ఆలయాభివృద్ధి పనుల నేపథ్యంలో కూల్చివేతల జరుగుతున్నందున ఈ మార్పులు జరుగుతున్నాయి.
News November 13, 2025
నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్కు ముందు ఉమర్కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.


