News January 28, 2025

వనపర్తి: ప్రభుత్వ ఖజానాకు తగ్గిన భారం రూ.5.12 కోట్లు

image

వనపర్తి జిల్లాలో సాగుకు పనికిరాని భూములను వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు గుర్తించారు. మొత్తం 15 మండలాల్లో సర్వే ద్వారా మొత్తం 4269.84 ఎకరాల భూములు సాగుకు పనికి రావని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ భూములకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరాకు ఇచ్చే రైతు భరోసా రూ.12 వేలు వర్తించదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.5.12 కోట్ల భారం తగ్గనుంది.

Similar News

News July 6, 2025

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6.8 మి.మీ వర్షపాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. రఘునాథపాలెం మండలంలో 1.0, ఏన్కూరు మండలంలో 5.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. ఈ రెండు మండలాలు మినహా గడిచిన 24 గంటల్లో ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

News July 6, 2025

ఐఐఐటీకి తగ్గుతున్న వికారాబాద్ జిల్లా విద్యార్థుల సంఖ్య

image

వికారాబాద్ జిల్లా నుంచి ఐఐఐటీలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి అభ్యసించిన విద్యార్థుల మార్కుల ఆధారంగా బాసరలో అడ్మిషన్లు పొందుతున్నారు. గతేడాది VKB జిల్లా నుంచి 18 మంది ఐఐఐటీకి ఎంపికవగా.. ఈ ఏడాది కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ఐఐఐటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

News July 6, 2025

శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

image

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.