News December 21, 2025

వనపర్తి: బాధితులకు రూ.12.50 లక్షల సైబర్ సొమ్ము అప్పగింత: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో నమోదైన 17 సైబర్ నేర కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.12.50 లక్షల నగదును పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఈ సొమ్మును బాధితులకు అందజేసినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సైబర్ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి ఈ మొత్తాన్ని ట్రేస్ చేశారని, న్యాయస్థానం ద్వారా చట్టబద్ధంగా బాధితులకు తిరిగి అప్పగించామని ఆమె పేర్కొన్నారు.

Similar News

News December 23, 2025

OFFICIAL: వారణాసిలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్

image

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలక్షణ నటుడు <<18570987>>ప్రకాశ్ రాజ్<<>> నటిస్తున్నారంటూ గాసిప్స్ వైరలైన విషయం తెలిసిందే. తాను వారణాసి చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పుడు స్వయంగా ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ‘వారణాసి షూటింగ్‌లో అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. రాజమౌళి, మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాకు థాంక్స్. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News December 23, 2025

KNR: ‘ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి’

image

KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. తరచుగా ప్రమాదాలు జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

News December 23, 2025

‘పల్లె వెలుగు’ బస్సులూ EV ACవే ఉండాలి: CBN

image

AP: RTCలో ప్రవేశపెట్టే బస్సులు, ‘పల్లెవెలుగు’ అయినా సరే ఎలక్ట్రికల్ ఏసీవే ఉండాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘వచ్చే ఏడాది కొనే 1450 బస్సులూ ఈవీనే తీసుకోవాలి. 8819 డీజిల్ బస్సుల స్థానంలో EVలనే పెట్టండి. 8 ఏళ్ల కాలపరిమితి దాటిన వాటినీ మార్చాలి. తిరుమల- తిరుపతి మధ్య రవాణాకు 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది’ అని వివరించారు. బస్సుల మెయింటెనెన్సును ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు.