News February 24, 2025
వనపర్తి: బాల్యవివాహాల అడ్డకట్టకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. P.M మోదీ 2015 జనవరి 22న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే 1098 కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News February 24, 2025
యూజీసీ జేఆర్ఎఫ్ సాధించిన ఏయూ విద్యార్థి

ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగ విద్యార్థి శ్యామ్ యూజీసీ జేఆర్ఎఫ్ సాధించాడు. దివ్యాంగుడైన శ్యామ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిభ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ జేఆర్ఎఫ్ సాధించడం పట్ల విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్యామ్ని విభాగంలో సత్కరించారు. శ్యామ్ నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు.
News February 24, 2025
SSS: ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి- కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహిస్తున్న రీసర్వే పనులపై ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఫ్రీ హోల్డ్కు సంబంధించిన అంశాలను ఈనెల 28వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 24, 2025
కృష్ణా జిల్లాలో 48 గంటలు మద్యం దుకాణాలు బంద్

కృష్ణా జిల్లాలో ఈ నెల 27వ తేదీన MLC ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్కు 48 గంటల ముందు జిల్లాలో మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీన సాయంత్రం 4 వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసి వేయాలన్నారు. ఉత్తర్వులను బేఖాతరు చేస్తే సంబంధిత మద్యం దుకాణాల లైసెన్స్లు రద్దువతాయని హెచ్చరించారు.