News February 16, 2025

వనపర్తి: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్  

image

వనపర్తి జిల్లాలోని కోర్టులలో మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్, బ్యాంకు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకునేలా కృషి చేయాలన్నారు.

Similar News

News February 26, 2026

పార్వతీపురం: డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం

image

జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్‌ శాఖలతో జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్‌లలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయాలని సూచించారు.

News February 26, 2026

బొప్పాపూర్: ‘పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’

image

పీఎంశ్రీ కింద ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్ లో అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత విద్యాలయంలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించారు.

News February 26, 2026

DGCA కొత్త రూల్స్.. 48 గంటల్లోగా..!

image

విమాన టికెట్ల రిఫండ్ రూల్స్‌లో DGCA సవరణలు చేసింది. టికెట్ కొన్న 48 గంటల్లోగా క్యాన్సిల్/మార్పులు చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు కట్టక్కర్లేదని చెప్పింది. అలాగే టికెట్లు క్యాన్సిలేషన్ డబ్బులను 14 రోజుల్లో రిఫండ్ చేయాలంది. అటు టికెట్లు బుక్ చేసుకున్న 24గంటల్లో పేర్లలో కరెక్షన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజ్ తీసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. అనారోగ్య కారణాలతో కాన్సిల్ చేసుకున్నా ఇవి వర్తిస్తాయంది.