News January 24, 2025
వనపర్తి: రాజకీయాలకు చివరి తేదీ లేదు: ఎమ్మెల్యే

రాజకీయాల్లో కొనసాగాలనుకునే వారికి చివరి తేదీ అంటూ ఏమీ లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా వనపర్తి అభివృద్ధికి పనిచేద్దామన్నారు. అన్ని వార్డులు మనవేనని అభివృద్ధిలో వివక్ష చూపేది లేదన్నారు. కౌన్సిలర్ల పదవీకాలం ముగివస్తున్న నేపథ్యంలో అందరికీ శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
Similar News
News February 24, 2026
TU: తెలుగు అధ్యయన శాఖ బోర్డర్ స్టడీస్ ఛైర్మన్గా ఆచార్య కనకయ్య

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్గా ఆచార్య కనకయ్య నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆడిట్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్, డీన్, విభాగాధిపతిగా వ్యవహరించారు. ఆయన నియామకం పట్ల పలువురు అధ్యాపకులు అభినందించారు.
News February 24, 2026
యాదాద్రి: రేపు గజవాహన సేవ, కళ్యాణోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు స్వామివారు శ్రీరామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంపై ఊరేగనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు గజ వాహన సేవ, రాత్రి 9:30 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరగనున్నాయి. ఈ పవిత్ర వేడుకలకు భక్తులు భారీగా తరలిరావాలని ఆలయ అధికారులు కోరారు.
News February 24, 2026
పార్వతీపురం: ‘సార్వత్రిక ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు’

జిల్లాలో మార్చి 2వ తేదీ నుంచి 13 వరకు జరగనున్న 10వ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇంటర్ విద్యార్థులకు 2 కేంద్రాలను కేటాయించినట్లు పేర్కొన్నారు.


