News March 19, 2025

వనపర్తి: రైతులకు ఏం చేశారో చెప్పండి: మాజీ మంత్రి

image

అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2050 నాటికి తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పదేళ్ల KCRపాలనలో తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు. 

Similar News

News March 19, 2025

KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

AP: రాష్ట్రంలోని KGBVల్లో 2025-26 విద్యాసంవత్సరానికిగానూ 6వ తరగతి, ఫస్ట్ ఇంటర్ ఎంట్రెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష SPD శ్రీనివాసరావు తెలిపారు. 7, 8, 9, 10, సెకండ్ ఇంటర్‌లో మిగిలిపోయిన సీట్లకు కూడా దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. https://apkgbv.apcfss.in/ సైట్‌లో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. 70751 59996 నంబరును సంప్రదించవచ్చు.

News March 19, 2025

బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

హనుమకొండ జిల్లా భీమారం పలివేల్పుల రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైనింగ్ హాల్, వాష్ ఏరియాను పరిశీలించారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సుభాషిణిని కలెక్టర్ ఆదేశించారు.

News March 19, 2025

కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

image

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.

error: Content is protected !!