News September 22, 2025

వనపర్తి: రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో ఇటీవల విద్యుత్ ప్రమాదాల్లో 11 మంది రైతులు చనిపోయిన నేపథ్యంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. తడి నేలల్లో విద్యుత్ మోటార్లను ఆన్, ఆఫ్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ లైన్లలో ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా రైతులు రబ్బరు చెప్పులు ధరించాలని ఎస్పీ కోరారు.

Similar News

News September 22, 2025

ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>చెన్నై<<>> ఆవడిలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌ 20 జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. బీటెక్, BE, MBA ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులైనవారు అప్లికేషన్లను OCT 11వరకు ఆర్డినరీ పోస్టు ద్వారా పంపాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News September 22, 2025

కొమురవెల్లి: ప్రేమ విఫలం యువకుడి ఆత్మహత్య

image

ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమురవెల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గౌరాయిపల్లికి చెందిన పెద్ది మధుసూదన్ రెడ్డి(23) గత కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. యువతి ఇంట్లో ప్రేమ విషయం తెలవడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News September 22, 2025

KNR: రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన లారీ

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి KNRవైపు వెళ్తున్న ఓ లారీ తాడికల్ గ్రామ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళ గాయపడగా మరో మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. లారీ పాక్షికంగా దెబ్బతింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.