News April 24, 2025
వనపర్తి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్లోని రైస్ మిల్లులో 160 కేవీ పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయాలని కాంట్రాక్టర్ సలీం సదరు ఏఈ కొండయ్యను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వనపర్తి విద్యుత్ కార్యాలయంలో కొండయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏఈని నాంపల్లి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.
Similar News
News August 22, 2025
పాలమూరు: APK ఫైల్.. బి కేర్ ఫుల్..!

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. SMలో ఏపీకే ఫైల్ ద్వారా ఫేక్ లింక్ పంపించి ఫోన్లను హ్యాక్ చేసి ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT
News August 22, 2025
పాలమూరు: UG, PG..APPLY చేసుకోండి

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News August 21, 2025
2025-26 ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ

2025-26 సంవత్సరానికి గాను ధాన్యం సేకరణకు ముందస్తు కార్యచరణ రూపొందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకి సరిపడా గన్ని బ్యాగులు, మిల్లింగ్ సామర్థ్యం స్టోరేజ్ స్పేస్ ముందుగా ఏర్పాటు చేసుకొని ఇలా కార్యచరణ రూపొందించాలని అన్నారు.