News April 15, 2025
వనపర్తి: వేలిముద్రలు పడటం లేదని బియ్యం ఇవ్వడం లేదు: బుచ్చమ్మ

చేతి వేలిముద్రలు కంప్యూటర్లో పడటం లేదని రేషన్ షాపులో ఉచిత బియ్యం ఇవ్వటం లేదని పానగల్ మండలం కేతేపల్లికి చెందిన తెలుగు బిచ్చమ్మ తెలిపారు. రేషన్ కార్డులో తన ఒక్క పేరే ఉందన్నారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు చెరిగిపోయాయని చెప్పారు. కంప్యూటర్లో వేలిముద్రలు నమోదు అయితేనే బియ్యం వస్తాయని చెబుతూ, కొన్నాళ్లుగా ఇవ్వటం లేదని బియ్యం ఇప్పించాలని, అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 15, 2025
జగిత్యాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభ

బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News September 15, 2025
జగిత్యాల : దుర్గ శరన్నవ రాత్రోత్సవాలకు ఆహ్వానం

జగిత్యాల పట్టణంలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించనున్న శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 15, 2025
నెల్లూరు:13 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

11 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు ఇద్దరు ఏవోలకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవో మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నలుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు, తిరుపతి జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలకు ప్రకాశం జిల్లాలో నలుగురు, బాపట్ల జిల్లాలో ఒకరికి పదోన్నతి కల్పించారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఏవోగా పనిచేస్తున్న ఒకరిని బాపట్ల జిల్లాలో ఒకరిని ఎంపీడీవోగా నియమించారు.