News April 7, 2025

వనపర్తి: ‘సింగోటం గుడిలో ప్రేమ జంట పెళ్లి చేస్తాం’

image

తమకు పెళ్లి చేయాలని వనపర్తి జిల్లా పానగల్ PSకు వచ్చిన <<16017433>>నందిని, మహేందర్<<>> పెళ్లి త్వరలో చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని హైదరాబాద్‌లో ఫామ్-డి చదువుతోందని, మహేందర్ డిగ్రీ చదివి జాబ్ సెర్చ్ చేస్తున్నాడన్నారు. ఇద్దరు మేజర్లు, అందులోనూ చదువుకున్న వారు కావడంతో వారి పెళ్లికి కుటుంబీకులను ఒప్పించామని చెప్పారు. మంచి ముహూర్తం చూసి త్వరలో కొల్లాపూర్ పరిధి సింగోటం గుడిలో పెళ్లి చేస్తామన్నారు.

Similar News

News December 16, 2025

NRPT: ఈనెల 18న T-20 లీగ్ క్రికెట్ జట్టు ఎంపికలు

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 18న MDCA, జీ వెంకటస్వామి కాక మెమోరియల్, HCA ఆధ్వర్యంలో T-20 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ ఇన్‌ఛార్జ్ రమణ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఆసక్తి గల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 ఫొటోలతో ఉదయం 9 గంటలలోపు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 91007 53683 చరవాణికు సంప్రదించాలన్నారు.
అవసరమైన వారికి SHARE IT.

News December 16, 2025

మచిలీపట్నం: ‘అటల్-మోదీ’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే.!

image

నేడు మచిలీపట్నం రానున్న ‘అటల్-మోదీ’ సుపరిపాలన బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చల్లరాస్తా సెంటర్, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్, డీ మార్ట్ రోడ్డు మీదుగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌కు చేరుకుంటుంది. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

News December 16, 2025

విజయనగరం: దేశంలో తొలి AAD ఎడ్యుకేషన్ సిటీ.!

image

విజయనగరం జిల్లా భోగాపురంలో దేశంలోనే తోలి ఏవియేషన్ ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఏడ్యుకేషన్ సిటీని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో నేడు లాంఛనంగా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. జీఎంఆర్-మాన్సాస్ ఆధ్యర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో 160 ఎకరాల స్థలంలో స్థాపించనున్నారు. ఈకార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు.