News September 9, 2025

వనపర్తి: 13న జాతీయ మెగా లోక్ అదాలత్

image

ఈనెల 13న జరుగు జాతీయ మెగాలోక్ అదాలత్‌‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీ మార్గమే రాజ మార్గం అన్నారు. కొట్టుకుంటే ఒకరే గెలుస్తారు, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని, రాజీతో సమయాన్ని డబ్బులను ఆదా చేసుకోవచ్చన్నారు. వివాదాలు అనేవి పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయి.. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఓ నిర్ణయానికి వస్తే అప్పుడే సమసిపోతాయన్నారు.

Similar News

News September 10, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన C.P.రాధాకృష్ణన్
* క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి దామోదర
* గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: TG హైకోర్టు
* సీఎంకు, నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి: KTR
* 4 దశల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు: SEC
* ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల
* నేపాల్‌లో ఆర్మీ పాలన.. ప్రధాని రాజీనామా
* నేపాల్ మంత్రులను తరిమికొట్టిన నిరసనకారులు

News September 10, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్?

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన NDA అభ్యర్థికి 452 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏకు 427+11(వైసీపీ) ఎంపీల సపోర్ట్ ఉంది. దీని ప్రకారం NDAకు 438 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి క్రాస్ ఓటింగ్ ఓట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఇండీ కూటమి ఎంపీలు 315మంది ఓట్లేశారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కానీ ఫలితాల్లో వారి అభ్యర్థికి 300 ఓట్లే పడ్డాయి. మరోవైపు 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

News September 10, 2025

ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

image

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.