News February 28, 2025
వనపర్తి: 502 పడకల ఆసుపత్రికి అధిక నిధుల కేటాయింపు

వనపర్తిలో మొత్తం 10 అభివృద్ధి పనులకు మార్చి 2న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఒక 502 పడకల ఆస్పత్రి భవనం నిర్మాణానికే అత్యధిక నిధులు కేటాయించారు. రూ.721 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనుండగా, ఆస్పత్రి భవన నిర్మాణానికే రూ.257 కోట్లు ఖర్చు చేయనున్నారు. వనపర్తి మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి భవనం నిర్మిస్తారని అధికారులు చెబుతున్నారు. పేద రోగులకు ఎంతో మెరుగైన వైద్య సౌకర్యం అందుతుందంటున్నారు.
Similar News
News February 28, 2025
ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
News February 28, 2025
MBNR: చివరి అవకాశం.. నేటితో ముగియనున్న కులగణన సర్వే

మహబూబ్ నగర్ జిల్లాలో నేటితో కులగణన సర్వే ముగియనుంది. గతంలో ప్రభుత్వం సర్వే చేసిన కొందరు వివరాలు నమోదు చేసుకోలేదు. ఇంకా సర్వేలో పాల్గొననివారు, వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో వివరాలు నమోదు అధికారులు సూచించారు. కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇవ్వగా.. నేటితో సర్వే ముగుస్తోంది. సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వ పథకాలు దూరమయ్యే అవకాశం ఉంది.
News February 28, 2025
దివ్యాంగుడితో కోహ్లీ సెల్ఫీ.. పిక్ వైరల్

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ దివ్యాంగుడితో ఆయన సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని మెచ్చుకుంటున్నారు. కాగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచులో విరాట్ అద్భుత సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.