News July 9, 2024
వన మహోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా జరుగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు.
Similar News
News February 6, 2026
MBNR: రైతులు ALERT..యూరియా ఉంది!

మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 63,430 మంది రైతులు 25,675 యూరియా బస్తాలను బుక్ చేసుకొని కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ వెల్లడించారు. 11,892 యూరియా బస్తాలు ఇంకను రైతులకు బుక్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయని, రైతు తనకు అందుబాటులో ఉన్న మండలం, డీలర్ను ఎంచుకుని బుకింగ్ చేసుకోవాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు.
News February 6, 2026
MBNR: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్–I,II, పోలీస్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ తరగతులు పీజీ కళాశాల సెమినార్ హాల్లో ఉదయం 6.30–8.30, సాయంత్రం 5.00–8.00 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6న సాయంత్రం 5.00 గంటలకు హాజరుకావాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.భూమయ్య పేర్కొన్నారు.
News February 5, 2026
పాలమూరు: నేటి ముఖ్య వార్తలు

✒PU.. డిగ్రీ ఫలితాలు విడుదల
✒MBNR: మున్సిపల్ ఎన్నికల పీసీసీ కో ఆర్డినేటర్గా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
✒పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: విజయేందిర బోయి
✒PMను కలిసే అవకాశం..రిజిస్ట్రేషన్ చేసుకోండి
✒పాలమూరు: తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ
✒మెట్టుగడ్డ మార్కెట్పై కాంగ్రెస్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✒మున్సిపల్ ఎన్నికలు.. జోరుగా కొనసాగుతున్న ప్రచారం


