News July 3, 2024

వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: మంత్రి

image

రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సత్తుపల్లి డివిజన్లో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కొండా సురేఖ హెలికాప్టర్లో వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Similar News

News October 11, 2024

WGL: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి

image

WGL,HNK, JN, BHPL, MHBD, MLG జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News October 11, 2024

వరంగల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

వరంగల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపల్లి అఖిల్ శుక్రవారం బైకుపై వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్నాడు. డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News October 11, 2024

కాజీపేట: 100 డాలర్ల నోట్లతో అమ్మవారికి దండ

image

హనుమకొండ జిల్లా కాజీపేట వెంకటేశ్వర కాలనీలోని రహమత్ నగర్‌లో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దుర్గామాత దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పాక రాజయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 డాలర్ల నోట్లతో అమ్మవారికి హారం రూపంలో దండ వేశారు.