News March 1, 2025

వరంగల్‌కు ఎయిర్‌పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

image

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్‌వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్

Similar News

News December 19, 2025

రంగారెడ్డి: పల్లే పోరులో బీసీలదే హవా!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన GP ఎన్నికల్లో బీసీ అభ్యర్థులదే హవా కొనసాగింది. జనరల్ స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 525 జీపీలకు 92 స్థానాలు బీసీలకు కేటాయించగా 198 బీసీ అభ్యర్థులు విజయం సాధించారు. జనరల్ స్థానాల్లో 106 మంది గెలుపొందారు. VKBలో 594 జీపీలకు107 స్థానాలకు 219 స్థానాల్లో గెలుపొందారు. 112 జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు సత్తాచాటారు.

News December 19, 2025

నేటి నుంచే బుక్ ఫెయిర్

image

TG: 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 29 వరకు కొనసాగనుంది. రోజూ 1PM నుంచి 9PM వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ రూ.10 కాగా రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులకు ప్రవేశం ఉచితం. జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలతో మొత్తం 365 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. 11 రోజుల్లో 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి మీరు వెళ్తున్నారా?

News December 19, 2025

హాదీ మృతితో బంగ్లాలో అల్లర్లు.. ఎవరతడు?

image

రాడికల్ ఇంక్విలాబ్ మోర్చాకు చెందిన కీలక నేత షరీఫ్ <<18609088>>ఉస్మాన్<<>> హాదీ. హసీనాను PM పదవి నుంచి దించేందుకు చేసిన ఘర్షణలకు ఆయనే నాయకత్వం వహించారు. దీంతో బంగ్లాలో హాదీ హీరో అయ్యారు. 2026 FEBలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఈ నెల 12న ఢాకాలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించగా నిన్న చనిపోయారు. దీంతో ఆయన మద్దతుదారులు అల్లర్లకు తెగబడ్డారు.