News March 8, 2025
వరంగల్ను శాసిస్తున్న మహిళా శక్తి

ఓరుగల్లును మరోసారి మహిళా శక్తి శాసిస్తోంది. ఒకప్పుడు రుద్రమదేవి పరిపాలనలో గొప్ప శోభను అందుకున్న వరంగల్ రాజ్యం, నేడు అనేక కీలక పదవుల్లో మహిళా నేతలతో మరో చరిత్ర సృష్టిస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్ ప్రాంతాన్ని నడిపిస్తున్న మహిళా నేతల కృషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలక హోదాల్లో మహిళా నేతలు ప్రభుత్వ పరిపాలన నుంచి రాజకీయాల వరకు భాగమవుతున్నారు. HAPPY WOMEN’S DAY.
Similar News
News July 9, 2025
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
News July 9, 2025
నాగార్జునసాగర్ నిండితే వారికి పండుగే..

నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఎమోషన్. ఇది నిండిందంటే చాలు వారికి పండుగే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 3.75 లక్షల ఎకరాలు ఉంది.
News July 9, 2025
సిగాచీ.. ఆ 8 మంది మృతిచెందారని అనుమానాలు

TG: సిగాచీ ప్రమాద ఘటనలో ఆచూకీ దొరకని 8 మంది మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించడం కష్టమేనని తెలిపారు. రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కాలి బూడిదై ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఈ ఘటనలో అంతకుముందు 44 మంది మరణించారు.