News March 26, 2025

వరంగల్:రీవాల్యుయేషన్‌‌కు 21,920 దరఖాస్తులు!

image

ఇటీవల కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 1st సెమిస్టర్లో 21.9%, 3rd సెమిస్టర్లో 28.9%, 5th సెమిస్టర్లో 40.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు. ఆయా సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారు రీవాల్యుయేషన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 21,920 దరఖాస్తులు వచ్చాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Similar News

News October 28, 2025

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు

image

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని, ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 70,842 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 25,125 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

News October 28, 2025

జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు రికార్డు ధర!

image

వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. నిన్న వేలంలో కేజీ రూ.454 పలికి చరిత్ర సృష్టించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఐదు పోగాకు కేంద్రాల్లో వేలం జరగ్గా.. గోపాలపురంలో రూ.454 ధర పలికింది. ఇటీవల పలికిన అత్యధిక ధర రూ.430, రూ.420, రూ.415. కాగా ఈ ఏడాది మొదట్లో కేజీ రూ.290 మాత్రమే పలకడంతో రైతులు నిరాశ చెందారు. తర్వాత క్రమంగా పెరుగుతూ ఎక్కువ కాలం రూ.350 వద్ద నమోదు అవుతూ వచ్చింది.

News October 28, 2025

అమరావతిలో రైల్వే కోచింగ్ టెర్మినల్ ప్రణాళిక

image

అమరావతి రాజధాని, గుంటూరు నగరాల్లో రైల్వే కోచింగ్ టెర్మినల్స్‌ ఏర్పాటు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రైళ్ల సంఖ్య గణనీయంగా పెరుగనుంది. సోమవారం CM చంద్రబాబు, రైల్వే GM సంజయ్ శ్రీవాస్తవతో సమావేశమై అమరావతిలో నిర్మించబోయే రైల్వేస్టేషన్‌ను ఆధునికంగా తీర్చిదిద్దాలని సూచించారు. నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు-గుంతకల్లు మార్గాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.