News January 11, 2026
వరంగల్లో PDS బియ్యం సీజ్.. వ్యాపారుల కుమ్ములాట..!

రేషన్ బియ్యం దొంగల వ్యవహారం బయట పడింది. వరంగల్కు చెందిన రెండు వర్గాలు హన్మకొండలో రేషన్ బియ్యం దందా చేసే వారికి అమ్ముకునేందుకు ఉర్సుగుట్ట వద్ద ఓగోడౌన్లో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం దాచారు. పోలీసులు గోడౌన్ పై దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హన్మకొండ వ్యాపారుల వల్లే బియ్యం పట్టుకున్నారని వరంగల్ వ్యాపారులు గొడవపడగా స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 13, 2026
మేడ్చల్: 3 రంగుల జెండాను నిలబెట్టిన ముగ్గురు ‘లత’లు!

మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉద్దమర్రి వార్డులకు చెందిన రాజీగళ్ల లత, పెద్దిరెడ్డి లత, దోసకాయల లత కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకే పేరుతో బరిలోకి దిగిన ఈ ముగ్గురు హస్తం గుర్తు మీద విజయం సాధించారు. ఎంసీపల్లిలో కారు స్పీడ్కు ఈ ముగ్గురు బ్రేకులేయడం చర్చనీయాంశమైంది. ఒకే పేరుతో ముగ్గురు కౌన్సిలర్లు కొలువుదీరడం గ్రామంలోనే కాదు మున్సిపాలిటీ అంతటా ఆసక్తిగా మారింది.
News February 13, 2026
మున్సిపోల్స్.. 3 కార్పొరేషన్లలో హంగ్?

TG: కార్పొరేషన్ల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని 60 స్థానాల్లో చెరో 22 చోట్ల కాంగ్రెస్, CPI గెలవగా 8 చోట్ల BRS గెలిచింది. ఇప్పటికే CPIకి సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో CPIకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. అటు కరీంనగర్, నిజామాబాద్లో మేయర్ పీఠం కోసం BRS లేదా స్వతంత్రులపై BJP ఆధారపడటం తప్పేలా లేదు.
News February 13, 2026
క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీపై లోక్సభలో ఎంపీ ప్రశ్న

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్సభలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటు, మార్గదర్శకాలు, రోగుల అర్హత ప్రమాణాలపై కేంద్ర ఆరోగ్య శాఖను వివరణ కోరారు. కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. అవసరమైన సదుపాయాలు ఉన్న ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు.


